సత్యసాయి: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల మండలం పాలసముద్రంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారులతో మంత్రి రైతుల ఇళ్లకు వెళ్లి, ఏయే పంటలు వేస్తే డిమాండ్ ఉంటుందో వివరించారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.