CTR: చౌడేపల్లి(మం) బిల్లేరు ఖానా సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్సర్ బాషాకు చెందిన మామిడి తోటలో మంటలు రేగినట్టు తమకు సమాచారం అందినట్టు పుంగనూరు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. సిబ్బంది అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో మంటలు అదుపు చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో రూ. 10 వేల నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు.