AKP: రాంబిల్లి మండలం జెడ్.చింతువ, ఎం.చింతువ గ్రామాల పరిధిలో పరిశ్రమల కోసం భూసేకరణ పనులు చేపడుతుండడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు పూర్తి శాతం పరిహారం చెల్లించి గ్రామాలను తరలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించకుండా భూసేకరణ చేయరాదన్నారు.