ATP: తెలుగు రాష్ట్రాల్లోని మున్సిపాలిటీల చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి తాడిపత్రి వేదిక కాబోతోంది. తాడిపత్రి మున్సిపాలిటీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్కు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడం ద్వారా మున్సిపాలిటీకి నెలకు సుమారు రూ.22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా కానుంది.