E.G: అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కరువైందని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లజర్లలో మండల బజారు జట్టు వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం జరిగింది. పాలకవర్గాలకు ఓట్లు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంపై లేకపోవడం బాధాకరమన్నారు.