ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా దేవాలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. శోభాయాత్రలు, కళ్యాణ వేడుకల సమయంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.