PPM: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను ఉగాది నాటికి సాధించాలని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 34,965 గృహాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 20,859 గృహాలు పూర్తయ్యాయన్నారు.