శ్రీకాకుళంలో ఆదివారం ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్బీ గ్రూప్–డి అభ్యర్థుల కోసం కంప్యూటర్ ఆధారిత మాక్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వహణ ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు.