కోనసీమ: ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో MLA బండారు సత్యానందరావు హాజరయ్యారు. మండలంలో 1, 2, 3వ స్థానంతో పాటు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను MLA దుశ్శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.