అన్నమయ్య: రామసముద్రం మండలం వనగానపల్లిలో ఎస్.రాహుల్ (16) పదో తరగతి విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.