సత్యసాయి జిల్లా MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఆర్. జమునా బాయి తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 4తో ముగుస్తుందన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 12న ఉంటుందని, 6, 7, 8 తరగతుల ప్రవేశ పరీక్ష మార్చి 19న (మధ్యాహ్నం) ఉంటుందన్నారు.