కోనసీమ: కొత్తపేట మండలంలోని బిళ్లకుర్రు 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో RDSS పథకం పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రాంబాబు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బిళ్లకుర్రుతో పాటు మోడేకుర్రు, గొల్లకోటివారిపాలెం గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.