విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా హోంమంత్రి అనిత స్థానిక సబ్ జైలు, రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించి, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో రికార్డులు, సీసీ కెమెరాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.