NDL: పాణ్యం మండల పరిధిలో వెలసిన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వసతి గృహాల నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు. శనివారం ఆలయ ఈవో రామకృష్ణ మాట్లాడుతూ.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన చంద్రమౌళి-నాగలక్ష్మి దంపతులు వసతి గదుల నిర్మాణానికి ఈ విరాళం అందించారన్నారు. దాతలకు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.