TPT: చంద్రగిరిలో శుక్రవారం రాత్రి డిజిటల్ పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవో చంద్రశేఖర్రెడ్డి సిబ్బందితో కలిసి గృహాలు, దుకాణాల వద్దకు వెళ్లి డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేశారు. మార్చి 5 లోపు బకాయి పన్నులు చెల్లించాలని ఆయన ప్రజలను కోరారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా పారదర్శకతతో పాటు సులభతరం అవుతుందని తెలిపారు.