AKP: ఈ నెల 20, 21, 22వ తేదీల్లో నర్సీపట్నంలో జరుగు సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జీ.కోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఈ మహాసభల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా 21న బహిరంగ సభ జరుగుతుందన్నారు.