ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్కాపురం జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలని కోరారు.