E.G: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు క్షమాపణలు చెప్పాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజానగరంలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అమరావతిపై కక్షతో భూములు ఇచ్చిన తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.