కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి, ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉచిత చిన్న పిల్లలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.