TPT: గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్, పాత బస్టాండు ప్రాంతాలలో ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గురువారం చలివేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాదచారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు.