PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలేనికి చెందిన మధు, తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పొలాలకు వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన బయటపడింది.