కృష్ణా: జనరంజకంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శనివారం మచిలీపట్నం వచ్చిన ఆయన మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ రైతుల పేరు చెప్పి వైసీపీ నేతలు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు విడ్డూరంగా ఉందన్నారు.