NDL: ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. పట్టణంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలు అధికారులను సంప్రదించినప్పుడు వారి సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.