KDP: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదని వాగులు, వంకలు దాటరాదని సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.