ASR: అత్యవసర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పాడేరు జనరల్ ఆసుపత్రిలో శనివారం మాస్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి వైద్యం అందించడం, రోగుల తరలింపు డ్రిల్లో ప్రదర్శించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించామన్నారు.