KRNL: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ గురువారం అన్న క్యాంటీను పరిశీలించి, ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తి చెందేలా సేవలందించాలని ఆదేశించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలపై ఆయనఆరా తీశారు. నోడల్ అధికారులకు భోజనం తాజాగా, శుభ్రంగా ఉండేలా ప్రతిరోజూ పరిశీలించి, తాగునీరు, స్వచ్ఛత వంటి సదుపాయాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.