ATP: రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి రాయదుర్గంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. వైసీపీ పార్టీ మరింత అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారన్నారు.