SRPT: కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన కళ్యాణి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఇవాళ హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆమెకు ఈ గౌరవ పట్టాను అందజేశారు. ఆదివాసీల సమస్యలపై ప్రొఫెసర్ నాయుడు అశోక్ పర్యవేక్షణలో ఆమె చేసిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. తన విజయంలో సహకరించిన తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.