ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరుకు చెందిన బత్తిన శ్రీకాంత్ అనే దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాన్ని మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం 100% రాయితీతో ఉచితంగా 3 చక్రాల మోటారు వాహనాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోందన్నారు. నాయకులు బ్రహ్మేంద్రం, బత్తిన బ్రహ్మయ్య, వెంకట సుబ్బయ్య, పాల్గొన్నారు.