W.G: తాడేపల్లిగూడెం కడగట్లలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ప్రారంభించారు. పోషకాహార లోపంతో కంటి సమస్యలు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందకపోతే చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.