అనంతపురం కలెక్టరేట్లో భక్త కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ మొల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి రామాయణాన్ని తెలుగులో సరళంగా రచించిన ఆమె ప్రతిభ అసాధారణమని కొనియాడారు.