ATP: కూడేరులో వెలసిన శ్రీ సంగమేశ్వర స్వామి తేరు వేడుక కనులపండువగా జరిగింది. ఈ రథోత్సవానికి అనంతపురం జిల్లా నుంచి నుంచి వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి రథం గ్రామంలో వైభవంగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.