VZM: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని వేపాడ ఎంఈవో పీ బాల భాస్కరరావు కోరారు. దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలలో శనివారం జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన పలు ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.