GNTR: మంగళగిరిలో హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ను బుధవారం ‘ఏపీఎంసీఏ’ నేతలు కలిశారు. సీహెచ్వోలకు రూ. 30 వేల బేసిక్ పే, రూ.10 వేల ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, రాత్రి 8 గంటల ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఏడేళ్లుగా వేతన సవరణ లేక ఇబ్బంది పడుతున్నామని వివరించారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. వేతన సవరణపై ఆలోచన ఉందన్నారు.