KRNL: ఎమ్మిగనూరులో అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో కోరారు. మంత్రాలయం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాల కేసులు పెరగడంతో సత్వర న్యాయం అందడం లేదని పేర్కొన్నారు. హైకోర్టు అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే వివరించారు.