ATP: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల 27న జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సాధారణ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఎం.ప్రసాద్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ ఉత్తర్వులను పాటించాలని సూచించారు.