E.G: శంఖవరం మండలంలోని నీటి సంఘాల ఎన్నికల్లో కన్నమ్మ చెరువు సంబంధించి కొంతంగి బద్ది లోవరాజును ఛైర్మన్గా, ఉపాధ్యక్షుడుగా సర్నం నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికయిన సభ్యులు ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించి, రైతు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.