PLD: ప్రత్తిపాడు ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని వైసీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ భరోసా ఇచ్చారు. గుంటూరు ఆర్టీవో ఆఫీసు సమీపంలోని తన నివాసంలో బుధవారం ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. సమస్యలు పరిష్కరిస్తానన్నారు.