NDL: కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లె గ్రామానికి చెందిన దారా ప్రదీప్ అనే యువకుడు ఇటీవల గనిలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలని వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.1లక్ష మంజూరు కావడంతో వాటిని టీడీపీ నాయకుడు రామేశ్వర్ రెడ్డి బాధితునికి అందజేశారు.