ELR: ఉంగుటూరు గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆస్తి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు పరిశీలించారు. పంచాయతీ సచివాలయ సిబ్బందితోపాటు ఆయన కూడా ఇంటింటికి ఆస్తి పన్ను కులాయి పన్ను చెల్లించాలని కోరారు. ఉంగుటూరు గ్రామం పన్ను వసూళ్లలో ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ ఎంపీడీవో అన్నారు. కార్యదర్శి రవి పాల్గొన్నారు.