సత్యసాయి: తలుపుల మండలం మంగివాండ్లపల్లిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. సమస్యలను నేరుగా ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాటికి త్వరితగతిన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.