VZM: రాజాం మండలం శ్యాంపురం గ్రామ పరిధిలోని బ్రాహ్మణ అగ్రహారంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, స్మాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తుల సమక్షంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు నిర్వహించారు.