E.G: ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పిలుపులో భాగంగా శుక్రవారం రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో భరత్ ఆయన ఇంటి వద్దనే కూర్చొని నిరసన తెలిపారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.