W.G: నరసాపురం అదనపు సివిల్ జడ్జి ఎస్. రాజ్యలక్ష్మి శనివారం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె జైలులోని రికార్డులను పరిశీలించి, ముద్దాయిలతో నేరుగా మాట్లాడారు. వారి కేసుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి, జైలులో అందిస్తున్న ఆహారం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జైలు ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.