కోనసీమ: యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అముడా చైర్మన్ స్వామి నాయుడు పాల్గొన్నారు.