VZM: జామి మండలం విజినగిరి-తానవరం గ్రామాల మధ్య శుక్రవారం ఎమ్మెల్యే లలిత కుమారి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 కోట్లు నిధులతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి బాలాజీ రాంప్రసాద్ పాల్గొన్నారు.