SKLM: లావేరు మండలం బుడుమూరు ఉన్నత పాఠశాలలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (మార్చి 20) సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కో ఆర్డినేటర్ గోవిందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేసవిలో పక్షులకు నీటికోసం మట్టిపాత్రలు పంపిణీ చేసారు. అడవులు, పంట చేలు తగ్గడం కారణంగా పిచ్చుకలు కనుమరుగయ్యాయన్నారు.