SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఈనెల 21వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యకర్తలు నాయకులు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.