VZM: అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతిని విజయనగరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా ఎ.అర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు అర్పించారన్నారు.