ATP: కార్తీక మాసం మొదటి రోజు తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవారిని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి వెళ్లిన వారికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. వారిని అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.