సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై MLA కందికుంట వెంకటప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన, ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చి, ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.